NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‭సీటీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ప్రయాణికులకు ఇచ్చే టికెట్ల పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఐఆర్‭సీటీసీ సోమవారం ప్రకటించింది. అంటే ఒక ఐడీపై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టికెట్లకు ఇక నుంచి రెండింతల టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఆర్‭సీటీసీ వెబ్‭సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆధార్ లింక్ ఉన్న ఐడీలకు ఇక నుంచి ఒక నెలలో గరిష్టంగా 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇది 12 టికెట్ల పరిమితితో ఉండేది. ఇక ఆధార్ లింక్ లేని ఐడీలకు కూడా డబుల్ ఆఫర్ లభించింది.

                            

About Author