PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెయిన్ అల‌ర్ట్ .. భారీ వ‌ర్షాలు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: అల్పపీడ‌నం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌ కేంద్రం వెల్లడించింది. త‌మిళ‌నాడు, శ్రీలంక ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడ‌నం ప‌శ్చిమ దిశ‌గా క‌ద‌లుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. రానున్న 36 గంట‌ల్లో మ‌రింత బ‌ల‌ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అల్పపీడ‌నానికి అనుబంధంగా ఏర్పడిన ఆవ‌ర్తనం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కి.మిట‌ర్ల ఎత్తులో కొన‌సాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాల పరిధిలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

About Author