PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రైనా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా వేదికగా రైనా ప్రకటించాడు. “భారత్‌కు, నా రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌, సీఎస్‌కే, నా అభిమానులకు ధన్యవాదాలు” అంటూ రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.

                                        

About Author