NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాలు పోసి పెంచాడు.. కాటేశాయి !

1 min read

పల్లెవెలుగువెబ్ : అమెరికాలోని మేరీల్యాండ్ లో దారుణం జరిగింది. చార్లెస్ కౌంటీలో నివసించే ఓ 49 ఏళ్ల వ్యక్తి 125 పాముల్ని పెంచుకుంటున్నాడు. ఆ పాముల్లో 14 అడుగుల పొడవున్న బర్మిస్ కొండచిలువ, బ్లాక్ మాంబా, కింగ్ కోబ్రా వంటి పాములు ఉన్నాయి. ఇటీవల అతడు బయట కనిపించకపోవడంతో పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో అతడి మృతదేహం ఉంది. మృతదేహం చుట్టూ పాములు స్వేచ్చగా సంచరిస్తున్నాయి. దీంతో అతడు పాము కాటుకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

           

About Author