PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీలోకి రాజ‌గోపాల్ రెడ్డి ..!

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండితో రాజగోపాల్‌ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, నల్లగొండ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. అలాగే, మునుగోడు అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

                                         

About Author