PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిపోయార‌న్న వార్త పై మండిప‌డ్డ రాజ‌శేఖ‌ర్ కూతురు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాయ్ ఫ్రెండ్ తో పారిపోయార‌న్న వార్త‌ల‌పై రాజశేఖర్‌ కూతుళ్లు శివానీ, శివాత్మిక మండిపడ్డారు. ఈ మేరకు శివాత్మిక రాజశేఖర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. ‘ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరో? నెక్స్ట్‌ లెవల్‌ న్యూస్‌ రాస్తున్నారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి. బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి’ అంటూ ఫైర్‌ అయింది.

                      

About Author