PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాంకేతిక రంగానికి మారుపేరు రాజీవ్ గాంధీ

1 min read

– కంప్యూటర్ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి  రాజీవ్ గాంధీ !

– చిత్రపటానికి  పూలమాల వేసి ఘణనివాళులు అర్పించిన

– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు జ.లక్ష్మీ నరసింహ యాదవ్

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  పాణ్యం నియోజకవర్గం కల్లూరు కాలేజీ హాస్టల్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులర్పించిన లక్ష్మీ నరసింహ యాదవ్   కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొని  ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆగస్టు 20 1944 జన్మించారు. మరణానంతరము 1984-1989 మధ్య కాలం లో.. ప్రధానిగా  చేశారు. అతి పిన్న వయస్సులు  ప్రధానిగా చేసిన  ఘనత  రాజీవగాంధీ గారిది. రాజీవగాంధీ గారి పూర్తి పేరు రాజీవ్ రత్న గాంధీ. అయన ప్రధాని గా చేసిన ఎటువంటి భేషజం  లేకుండా ప్రజలకోసం  ఆలోచించిన వ్యక్తి.రాజావగాంధీ  ప్రధానిగా ఉన్న సమయం లో అనేక అభివృద్ధి  పధకాలను  ప్రవేశపెట్టిన ఘనత రాజీవగాంధీ గారిది.రాజీవగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో అనేక విప్లవత్మాక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించారు. ఒక గొప్ప శక్తి వంతమైన  రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన  వ్యక్తి.. రాజీవగాంధీ. 1966 లో UK నుంచి విద్యాబ్యాసం పూర్తి చేసుకుని  ఇండియా కి తిరిగి వచ్చి  పైలట్ గా ఉద్యోగ బాధ్యతలను  చేపట్టడం  జరిగింది. 1968 లో తను  ఇష్టపడిన  సోనియా గాంధీ ని పెళ్లిచేసుకోవడం, వారికి  ఇద్దరు పిల్లలు వారే  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. 1980 లో సోదరుడు  సంజయ్ గాంధీ  విమాన ప్రమాదం లో మరణించడం, తల్లి ఇందిరా గాంధీ  బలవంతం  వల్ల  దేశ రాజకీయాల్లో  కి రావడం  జరిగింది. సంజయ్ గాంధీ  ప్రాతినిధ్యం వహించిన  Amethi నియోజకవర్గం నుంచి లోక్ సభ కు పోటీ చేసి  గెలుపు పొంద పార్లమెంట్ లో అడుగు పెట్టడం  జరిగింది.1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ  దారుణ  హత్య తరువాత రాజీవగాంధీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.1984 డిసెంబర్ లో జరిగిన  ఎన్నికలలో 411 స్థానాలు  సాధించిన  అతి పెద్ద పార్టీ కాంగ్రెస్.రాజీవగాంధీ హయం లో తెలీకమ్యూనికేషన్స్ లో విప్లవత్మక  మార్పులు తెచ్చారు, సైన్స్ and టెక్నాలజీ, IT రంగం  ఎంతో అభివృద్ధి  చెందింది. ఈ రోజు IT రంగం  అభివృద్ధి  చెంద దానికి  కారణం  రాజీవగాంధీ గారు. గ్రామీణభివృద్ధి, కంప్యూటర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని సంకేతం గా ముందుకు తీసుకు వెళ్లిన వ్యక్తి రాజీవగాంధీ గారు. పారిశ్రామిక రంగంలో  పన్ను తగ్గింపు విధానాన్ని అవాలంభించి, రక్షణ, విమానయన, వాణిద్య రంగలు అభివృద్ధి చెందడానికి  కారణం  రాజీవ్ గాంధీ. ఈ విధానం వలన ఆధునిక  ఆర్థిక విధానం వలన  విదేశి పెట్టుబడులను  ఆకర్షించి పెట్టుబడులకు భారత్ ని స్వర్గధామం చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారి ది.1986 లో న్యూ నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన ఘనత రాజీవగాంధీ గారిది. ఈ  పాలసీ వల్ల  బడుగు  బలహీన  వర్గాల  అభ్యున్నతకి  ఎంతో  తొడపడింది. నవోదయ పాఠశాలలు స్థాపించి  విద్యలో ఒక గొప్ప మార్పు కు కారణమైన వ్యక్తి రాజీవ్  జీ.1987 లో బ్లాక్ బోర్డు ఆపరేషన్,1985 లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, నవోదయ స్కూల్స్ వీటి వల్ల  గ్రామీణ  లో ఉన్న వారు  విద్యావంతులుగా  అవడానికి  కారణమైన  వ్యక్తి రాజీవగాంధీ.ఆయన గురించి  చెప్పాలి  అంటే చాలా ఉంది. సమయం  లేదు. మనం  అందరం  రాహుల్ ని ప్రధాని ని చేసి  ఆ సంతోషాన్ని  రాజీవగాంధీ గారి కి అంకితం  చేయాలని లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పఠాన్ హాబిబ్ ఖాన్ ,కాంగ్రెస్ నాయకులు సాంబశివుడు ,రహీం, అబ్రహం నంద్యాల పార్లమెంట్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగలింగం , అమర్ , రమణ , శ్రీనివాసులు , దస్తగిరి కల్లూరు మండలం అద్యక్షులు , కల్లూరు మండల యస్సి సెల్ అధ్యక్షుడు శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.

About Author