PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర ఎన్నిక‌ల అధికారిగా రాజీవ్ కుమార్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషనర్ గా ఉన్న రాజీవ్‌ కుమార్‌ తదుపరి సీఈసీగా 15న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆ నోటిఫికేషన్‌ను తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. రాజీవ్‌ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 నిబంధన (2) ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్‌ కుమార్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు.

                                

About Author