PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన రాకేష్ ఝున్ ఝున్ వాలా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌న చిర‌కాల కోరిక తీర‌కుండానే ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా మ‌ర‌ణించారు. వివాహమైన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాకేశ్‌ దంపతులకు 2004లో సంతానం (కుమార్తె) కలిగింది. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కాగా, కుమార్తె పేరు నిష్ఠ. 2009లో ఇద్దరు కుమారులు ఆర్యమాన్‌.. ఆర్యవీర్‌ (కవలలు) పుట్టారు. తన కుమారులిద్దరూ పాతికేళ్ల వారయ్యాకా చూడాలని కోరుకుంటున్నానని 2010లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేశ్‌ చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కుమారులిద్దరికీ దాదాపు పదమూడేళ్లు. మరోవైపు, 2021లో 13 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

                                               

About Author