NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్రిక్తంగా రాకేశ్ అంతిమ‌యాత్ర‌.. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ పై దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల్లో చెల‌రేగిన హింస‌లో మృతి చెందిన వ‌రంగ‌ల్ రాకేశ్‌ అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. దారిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం కనిపించడంతో ఆందోళనకారులు దాడి చేశారు. పోచం మైదాన్‌ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. పోచం మైదాన్‌ కూడలి మీదుగా రాకేశ్‌ అంతిమ యాత్ర సాగుతోంది.

                                   

About Author