PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ చార్జీల బాదుడుకు నిరసనగా ర్యాలీ   

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: టీడీపీ రాష్ట్ర పిలిలుపు మేరకు విద్యుత్ చార్జీల బాదుడుకు నిరసనగా పత్తికొండ టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. అలాగే పత్తికొండ నియోజకవర్గం లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికేర,క్రిష్ణగిరి, వెల్దుర్తి  మండలాల్లో మండల హెడ్ క్వార్టర్ నందు విద్యుత్ సబ్స్టేషన్లు ఎదురుగా పెంచిన కరెంటు చార్జీలను వ్యతిరేకిస్తూ, నిఅసన కార్యక్రమాలు చేశారు. కరెంటు కోతలకు, రైతులు మోటార్లకు మీటర్లు బిగింపుకు వ్యతిరేకమా మండల కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మానస పుత్రిక అయిన విష పుత్రిక సొంత పత్రిక లో వచ్చిన కథనాలను చదువుతూ, కోతలు లేని కరెంటు అంటూ అబద్దాలు చెబుతూ కరెంటు బిల్లులు పెంచలేదంటూ ఇలా ఎన్నెన్నో అబద్ధాలను తన పత్రికలో ప్రచురించారు  అని అన్నారు.ఇలాంటి అబద్ధాలు రాసే  పేపర్ ను ప్రజలు నమ్మకూడదంటూ చించి వేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు పార్లమెంటరీ కమిటీ నాయకులు ఆయా మండల కమిటీ నాయకులు నియోజకవర్గ కమిటీ నాయకులు అనుబంధ సంస్థ కమిటీ నాయకులు కే.సాంబ శివారెడ్డి, రామ నాయుడు,ఎం.అశోక్ కుమార్,తిరుపాల్,సింగం శ్రీనివాసులు,మీరహుస్సెన్,శ్రీనివాసులు గౌడ్ మనోహర్ చౌదరి,ఉచూరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author