PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ష్టాల్లో రామ్ చ‌ర‌ణ్ బిజినెస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2015లో రామ్ చరణ్‌ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్‌ పేరుతో డొమాస్టిక్‌ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్‌ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది. ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేస్తూ.. ‘ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి. ఈ సంస్థలో పని చేసే ఇద్దరూ అధికారులు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఇన్వెస్టర్ కూడా రానున్నారు“ అని సంస్థ తెలిపింది.

                              

About Author