PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో గొప్పవి : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ పండుగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న యూ కాన్ షాపిలో ఉన్న ఫైజున్నీస మసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు. ముందుగా మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో టిజి భరత్ పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ టిజి భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో గొప్పవన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బషీర్ అహ్మద్, అశ్వక్, వలి, ఫైరోజ్, మన్సూర్ ఆలీఖాన్, మెహబూబ్ ఖాన్, వార్డు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

About Author