NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు ఎంఈఓ గా రామిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల విద్యాశాఖ అధికారిగా ఎస్.రామిరెడ్డి నియమితులయ్యారు. బదిలీలలో భాగంగా  నందికొట్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయనను మిడుతూరు ఇన్చార్జి ఎంఈఓ-1 గా అధికారులు నియమించారు.ఈయన సోమవారం ఎంఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాము బూట్లు తదితర వాటిని విద్యార్థులకు అందే విధంగా చూస్తానని ఎంఈఓ తెలిపారు.వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఎంఈఓ-2 శ్రీనాథ్ మరియు కార్యాలయ సిబ్బంది చంద్ర,రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.

About Author