PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవుణ్ణి న‌మ్మని రాంగోపాల్ వ‌ర్మ.. ఆల‌యానికి వెళ్లారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ వివాదాస్పద ద‌ర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. త‌న కొత్త చిత్రం కొండా సినిమా షూటింగ్ ను వ‌రంగల్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వరంగ‌ల్ లోని మైస‌మ్మ ఆల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. ఆల‌యంలో పూజ‌లు నిర్వహించారు. కొండా సురేఖ దంప‌తుల‌తో క‌లిసి ముచ్చటించారు. కొండా ముర‌ళి జీవితంలోని కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని ప్రధాన అంశంగా తీసుకుని ఈ సినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ప‌ట్ల ఆసక్తి పెరిగింది. సినిమాని పూర్తీగా తెలంగాణ‌లోనే చిత్రీక‌రించ‌నున్నట్టు చిత్రబృందం ప్రక‌టించింది. ఆర్జీవిని క‌లిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వ‌చ్చారు.

About Author