PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేప్ కేసు.. నిందితులు ప్ర‌జాప్ర‌తినిధుల పిల్ల‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం రేపుతున్న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో శనివారం పోలీసులు మరో ఇద్దరు మైనర్‌ బాలలను అదుపులోకి తీసుకుని జువైనైల్‌ కోర్టులో హాజరుపర్చారు. వీరిలో ఒకరు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు. మరో మైనర్‌ నెల్లూరు పారిపోతుండగా పట్టుకున్నారు. ఐదో నిందితుడైన మైనర్‌ను సంగారెడ్డి ప్రజా ప్రతినిధి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. అతడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, కేసులో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు ప్రముఖంగా వినిపించింది.

                                               

About Author