PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రషీద్.. డిగ్రీ పూర్తీ చేశాక ఎస్ఐ ఉద్యోగం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇండియన్ క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టన్ షేక్ రషీద్ కు రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల నగదుతో పాటు గుంటూరులో ఇంటి స్థలం కేటాయించనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. రషీద్ డిగ్రీ పూర్తీ చేసి అర్హత పొందగానే ఎస్ఐ ఉద్యోగమిచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రషీద్ తన తండ్రితో సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల అండర్ 19 ప్రపంచ కప్, ఆసియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినందుకు రషీద్ కు సీఎం అభినందనలు తెలిపారు.

             

About Author