PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్చి 5న కొణిదేలలో రథోత్సవం..

1 min read

– మార్చి 2 నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో వెలసిన శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కార్యక్రమం ఆదివారం మార్చి 5న నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ కొంగర నవీన్, కార్యనిర్వహణాధికారి యం. కార్తీక్ ,ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్ , కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పాల్గుణ మాస శుద్ధ దశమి మార్చి 2 నుంచి మార్చి 7 వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి 2న గురువారం స్వామి వారి కళ్యాణం, 3 న శుక్రవారం ఏనుగు సేవ, 4 న శనివారం ప్రభోత్సవం, 5 ఆదివారం రథోత్సవం, 6న సోమవారం పారువేట ,7న మంగళవారం వసంతోత్సవము జరపబడునని తెలిపారు.గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.తిరుణాల సందర్భంగా గుండు పందెం, పొట్టేళ్ల పందెం,పాల పండ్ల ఎద్దుల బండ పందెం, పెద్ద బండ ఎద్దుల పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తిరుణాలకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బండలాగుడు పోటీలలో పాల్గొను ఎద్దుల యజమానులు 9492570227, 8790002654, 9849853602, ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. బండ పందెమునకు వచ్చిన వారికి శ్రీ సత్యన్నారాయణ స్వామి గుడి దగ్గర గ్రామ రైతు సంఘం మరియు గ్రామ ప్రజల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు . సమావేశంలో ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, నాగలక్ష్మమ్మ, కురువ వేణుగోపాల్, చిన్న పుల్లయ్య, రామేశ్వరమ్మ, కళావతమ్మ, గ్రామస్తులు పెద్ద బాలన్న, రంగస్వామి, కొణిదేల బెస్త రాజు, గోపాల్ ,రాజేశ్వరరావు,కొంగర మూర్తి, మల్లెపోగు చిట్టెన్న,రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author