PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ రైతుల హక్కులు కాపాడాలి

1 min read

– టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్ , గడివేముల: రాయలసీమ సాగు నీటి హక్కులను కాపాడాలని, తక్షణమే గుండ్రేవుల సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్​ చేశారు నంద్యాల పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ వాసిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తక్షణమే రాయలసీమ రైతుల జీవనాధారమైన రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టకుండా.. జీవో లతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ సాగునీటి హక్కులకోసం కడప, కర్నూలులో మేధావులతో మేధోమథనం నిర్వహించామన్నారు. కర్నూలు జిల్లాలో 35 టీఎంసీలు నిల్వ సామర్థ్యం గల గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

About Author