PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ అండ్ బి ఉద్యోగి, ఏపీ ఎన్జీవోస్ సంయుక్త కార్యదర్శి మృతి

1 min read

నివాళులర్పించిన ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఆర్ అండ్ బి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఏలూరు తాలూకా సంయుక్త కార్యదర్శి గోడి సురేష్ కుమార్ మృతి చెందారు. బుధవారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన ఏపీ ఎన్జీవోస్ నాయకులు అసోసియేషన్ జండా ను సురేష్ కుమార్ పార్ధీవ దేహం పై ఉంచి వారికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ సురేష్ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన మరణం కుటుంబ సభ్యులకు మరియు సంఘానికి తీరనిలోటని తెలియజేశారు. అదేవిధంగా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు నెరుసు రామారావు, శ్రీధర్ రాజు, పూడి శ్రీనివాస్, బేగ్ తదితర నాయకులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

About Author