NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల అభ్యన్నతికే… ఆర్​బీకేలు

1 min read

– వైసీపీ మండల కన్వీనర్​ శ్రీనివాస్​ రెడ్డి
పల్లెవెలుగు, చిట్వేలి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… వారి అభ్యన్నతికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని వైసీపీ మండల కన్వీనర్​ శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. శుక్రవారం నేతివారిపల్లి గ్రామ సచివాలయంకు సంబంధించి రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆర్​బీకేలలో రైతులు కావలసిన అన్ని రకాల ఎరువులు. విత్తనాలు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు ఈ కేంద్రాల్లో ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మండలం వ్యవసాయ అధికారి సందీప్, పంచాయతీరాజ్ ఏఈ ఆంజనేయ ప్రసాద్, భాద్య విస్తరణ అధికారి శ్రీనివాసులు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కృష్ణవేణి, గ్రామ సర్పంచులు. గుండయ్య. ప్రభాకర్. రెడ్డయ్య. వైసీపీ నాయకులు పిచ్చి రెడ్డి. భాస్కర్ రెడ్డి. సచివాలయ సిబ్బంది. వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author