NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోదీతో టీవీ చ‌ర్చ‌కు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్‌ చర్చకు తాను సిద్ధమని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. తన రష్యా పర్యటన నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తమ సంబంధాలు సరిగా లేకపోవడంతో వాణిజ్యం పరిమితంగా ఉందన్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అఫ్ఘాన్‌తో యుద్ధం వంటి కారణాలతో ప్రాంతీయ వాణిజ్యంలో తాము బాగా వెనకబడి ఉన్నామన్నారు. దీనిపై భారత్‌ వెంటనే స్పందించలేదు. అయితే.. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాధ్యం కాదని ఇప్పటికే పలు సందర్భాలలో భారత్‌ స్పష్టం చేసింది.

                                         

About Author