NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్లగుట్ట కొండపై… ఎర్రజెండా రెపరెపలాడిస్తాం..గిడ్డయ్య

1 min read

పల్లెవెలుగువెబ్​, పత్తికొండ:నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య సిపిఐ మండల కార్యదర్శి. డి.రాజా సాహెబ్ .డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో కర్నూల్ రోడ్డు లోని నల్లగుట్ట కొండ ప్రాంతంలో సర్వే నెంబర్  699 లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక చదువుల రామయ్య భవనం నుండి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టి నల్లగుట్ట  ప్రాంతంలో భూ పోరాటం చేపట్టి  సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను నాటారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ భూ కబ్జాలకు పాల్పడే అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు దాసోహం అయ్యారని ఖబడ్దార్ అని హెచ్చరించారు. పేద ప్రజలు ఇళ్ల స్థలాల కొరకు ఆరాటపడుతుంటే, అధికార పార్టీ, ఎమ్మెల్యేలు మంత్రులు ఎత్తేచగా భూ కబ్జాలు చేస్తూ లక్షల, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే వారు చెప్పిందే వేదంగా భావించి రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల పక్షాన సిపిఐ, ఏఐటీయూసీ నాయకత్వాన ఎల్లవేళలా అండగా ఉంటూ వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించి న్యాయం చేసేంతవరకు పోరాడుతామని, నల్లగుట్ట కొండపై ఎర్రజెండాను రెపరెపలాడుస్తామని హెచ్చరించారు.

About Author