PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగ్రవాదుల‌కు మ‌ద్దతు ప‌లికేందుకే ‘ఎర్రటోపీ’ లు : మోదీ

1 min read

పల్లెవెలుగు వెబ్​ : స‌మాజ్ వాదీ పార్టీపై ప్రధాని న‌రేంద్రమోదీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ‘ఎర్ర టోపీ’లు ఉగ్రవాదులకు వంతపాడుతున్నాయని, టెర్రరిస్టులను జైళ్ల నుంచి విడిపించేందుకు అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. గోర‌ఖ్ పూర్ లోని ఓ స‌భ‌లో మాట్లాడుతూ “ మొత్తం యూపీకి తెలుసు. ఎర్ర టోపీలు మళ్లీ ఎర్ర బుగ్గ కార్లలో తిరగాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. పేదల కష్టాలు, బాధలను తీర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు మళ్లీ ఎర్రటోపీలు(స‌మాజ్ వాదీ పార్టీ టోపీ) అధికార దాహంతో ఉన్నాయి. అధికార పగ్గాలు చేపట్టి ఆక్రమణలు, కుంభకోణాలు చేసేందుకు సిద్ధమయ్యారు“ అంటూ మోదీ విరుచుకుపడ్డారు.

About Author