కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు బుధవారం తమిళనాడులోని కాంచీపురంలో స్వయంభూ వెలసిన కంచి కామాక్షి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తుందని,ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.