PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్, డీజిల్ పై రూ.10 త‌గ్గించాలి !

1 min read

పల్లెవెలుగు వెబ్:కేంద్ర ప్రభుత్వం దీపావ‌ళి కానుకగా పెట్రోల్, డీజిల్ పై 5 రూపాయ‌లు త‌గ్గించింది. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ధ‌ర‌లు త‌గ్గించాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. ఏపీ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 తగ్గించాలని సీపీఐ రామకృష్ణ అన్నారు. సంవత్సరం నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.36, డీజిల్‌పై రూ.25 పెంచిన కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించటం కంటితుడుపు చర్య అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పూర్తిగా తగ్గించాలని చెప్పారు. కేరళ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గించిందని చెప్పారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాయని పేర్కొన్నారు.

About Author