PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోండి

1 min read

పల్లెవెలుగు , వెబ్​ గడివేముల : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మండలానికి చెందిన గ్రాడ్యుయేట్లు టీచర్లు ఆఫ్లైన్లో గాని ఆన్లైన్లో వచ్చే నెల ఏడో తేదీ కల్లా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని గురువారం నాడు బీ ఎల్ ఓ లతో సమావేశమైన తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను బి ఎల్ వో లు పరిశీలించి నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు అలాగే కర్నూలు జిల్లా నుండి నంద్యాల జిల్లాకు మారిన సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ లు .టీచర్లు . ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డెసిగ్నేషన్ ఆఫీసర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author