PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నమోదు.. అభ్యంతరాలు ఉంటే తెలపండి

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండలంలోని ఆయా గ్రామాల పరిధిలో ఖరీఫ్ సీజన్ లో పంట నమోదు చేసుకున్న రైతులు పంట నమోదులో అభ్యంతరాలు ఉంటే తెలపాలని వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. శ్రీరంగాపురం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు ప్రదర్శించిన పంట నమోదు రైతుల జాబితాను సోమవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని అన్ని రైతు భరోసా కేంద్రాల నందు ఖరీఫ్ సీజన్లో పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తము సందర్శనకు ఉంచడం జరిగిందన్నారు. కావున ఆయా గ్రామాల పరిధిలోని రైతులందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వారి పంట నమోదు వివరాలను సరి చూసుకోవాలని తెలియజేశారు.అలాగే పంట నమోదు వివరాలలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత వ్యవసాయ సహాయకునికి వారి అభ్యంతరాలు తెలియజేస్తూ అర్జీనీ నవంబర్ 3 వ తేదీలోగా ఇవ్వాలని తెలియజేశారు.ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారి రాజు,విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు.

About Author