PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రబి సీజన్లో పంటల నమోదు తప్పనిసరి

1 min read

– ప్రతి రైతు విధిగా చేయించుకోవాలి.. జిల్లా వ్యవసాయ అధికారి టి మోహన్ రావు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: చిందుకూరు గ్రామంలో బుధవారం నాడు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని_ నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి టీ.మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు రైతు సోదరులతో ఈ పంటల నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ వీటి వల్ల అనేక లాభాలైన డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం , ధాన్యము సేకరణ, ఇన్పుట్ సబ్సిడీ , సున్నా వడ్డీ పంట రుణాలు పొందవచ్చని రైతులకు తెలియజేశారు. పిఎం కిసాన్ ఈనెల 15వ తారీకు తప్పులు సవరించుకునేందుకు చివరి తారీకు కాబట్టి రైతులందరూ రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించి తప్పులు సవరించుకొని లబ్ధి పొందవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు రైతు సోదరులు పాల్గొన్నారు.

About Author