PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7 వరకే శాసనమండలి ఓటు నమోదు

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు నవంబర్ 7 తేదీ వరకు గడువు ఉందని తహశీల్దార్ మహమ్మద్ రఫీ తెలిపారు. పట్టభద్రులు , టీచర్లు ఓటు కొరకు తమ దరఖాస్తులను 7 తేదీ లోపల తప్పక నమోదు చేసుకోవాలని , ఆదివారం కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని , ఓటు ఎంతో విలువైనదని అన్నారు. ఇంతవరకు పట్టభద్రులు ఆన్లైన్ లో 1694 మంది , అపలైన్లో 8 మంది , టీచర్లు ఆన్లైన్లో 99 మంది , ఆపలైన్లో 5 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. నేడు ఆధార్ లింకుపై స్పెషల్ డ్రైవ్ : వెలుగోడు మండలం లోని 47 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు కార్డుకు , ఆధార్ కార్డ్ లింక్ పక్రియ ను ఆదివారం బి.ఎల్.ఓ లు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారని తహశీల్దార్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఓటరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

About Author