PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పంటల బీమా’ నిధులు విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మండలంలో పంటలు దెబ్బతిన్న రైతులకు పంటలబీమా పథకం కింద నిధులు విడుదలైనట్లు ఏఓ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వీసీ కాన్ఫరెన్స్​ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో ఏఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కంది, టమేటా, పత్తి, వరిపంటలకు గాను ఒక కోటి 92 లక్షల 59 వేల 342 రూపాయలు పంటల బీమా కింద విడుదల అయినట్లు పేర్కొన్నారు. మొత్తం 1300 మంది రైతులకు సంబంధించి 2722 హెక్టార్లలో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ చంద్రశేఖర్ ,కార్యాలయ ఉద్యోగి రాజు,రాము గ్రామస్తులు గ్రామ సెక్రటేరియట్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author