PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల ప్రొబేష‌న్ డిక్ల‌రేష‌న్ జీవో విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ఏపీ ప్ర‌భుత్వం శనివారం విడుదల చేసింది . రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్ 5ను జారీ చేసింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కెల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రెటరీ, వార్డ్ సెక్రెటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది.

                                       

About Author