PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల సాగు కోసం… నీటిని విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు పట్టణంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మద్రాస్ కాలువ దగ్గరికి  నేడు ఎథిక్స్ కమిటీ చైర్మన్ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు మరియు ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్ లోని మద్రాస్ కెనాల్ ఒక గేటును ఎత్తి  వేయి క్యూసెక్కుల నీటిని కింది ప్రాంత  రైతులు(వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ) రైతన్నల సాగు కోసం కృషి చేయడం జరిగింది, రైతులకు ఆనందాన్ని కలిగించారు ఈ నీటి విడుదల కార్యక్రమానికి అన్నదాతలు , పార్టీలకు అతీతంగా  తండోపాతండాలుగా కదిలి వచ్చిన జనం తరలి వచ్చారు.  సరైన సమయంలో ప్రాజెక్టు నుండి రైతుల సాగు కోసం నీటిని విడుదల చేసినందుకు రైతన్నలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే  శిల్ప చక్రపాణి రెడ్డి గారికి మరియు ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి గారు, తెలుగు గంగ అధికారులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొనడం జరిగింది.

About Author