NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు మండలం 33 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మతులు

1 min read

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ కె.ఎం. అంబేద్కర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు మండలం, 33 కేవి ఏలూరు సబ్ స్టేషన్ లోమరమ్మతులు చేయుటకు గాను తేదీ.09.06.2025 (సోమవారం) ఉదయం 6.00  గంటల నుండి  11.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని  తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. యం. అంబేద్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అందువల్ల పవర్ పేట,పాత బస్టాండ్ ,గూడ్స్ షెడ్ రోడ్డు,వసంత మహల్ సెంటర్ వైఎంహెచ్ ఏ హాల్, మెయిన్ బజార్, చందన బ్రదర్స్ రోడ్, తూర్పు వీధి, పడమర వీధి, దక్షిణపు వీధి మరియు  పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *