PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రంలో బేడ బుడగ జంగాల సమస్యలు పరిష్కరిచాలని ఎంపీకి వినతి  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ పార్లమెంట్ సభ్యులు P.సంజీవ్ కుమార్కి  ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇస్తూ ఆ జాతి నేత తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మా జాతికిచ్చిన హామీ మేరకు క్యాబినెట్లోనూ, అసెంబ్లీలోనూ, తీర్మానం చేసి మా జాతి సమస్యను షెడ్యూల్ కులాల్లో కోల్పోయిన హక్కులను ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికె, కేంద్రానికి మన రాష్ట్రం నుంచి నివేదిక పంపడం జరిగినది. కనుక తమరు ప్రత్యేక చొరవ తీసుకొని మా జాతికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరడం జరిగినది, వాటికి ఎంపీ  స్పందిస్తూ మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు కొండపల్లి, గోకారి కళ్యాణ మారెప్ప,  సిరువాటి రంగస్వామి, బైల్పాటి మద్దిలేటి, పెద్ద చింతలయ్య, ధూపం చిన్న రాముడు, అంజి, సురేష్, కొండపల్లి కృష్ణ మొదలగువారు పాల్గొన్నారు.

About Author