PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీనామా చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి పార్టీని పటిష్టం చేయాలని సోనియా యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియా రాజీనామాలు కోరారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. మరోవైపు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు ఇప్పటికే రాజీనామా చేశారు.

                                                 

About Author