NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజీనామా చేయండి.. చంద్ర‌బాబు స‌వాల్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని చంద్రబాబు అన్నారు. 3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్‎కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మోసాలు, ఘోరాలు చేయడంలో వైసీపీ అధినేత దిట్టన్నారు. అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని సూచించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని, నమ్మక ద్రోహం చేసిన జగన్‎కు పాలించే హక్కు లేదని ధ్వజమెత్తారు. రాజీనామా చేయండి.. అప్పుడు రండి మాట్లాడుదామని చంద్రబాబు సవాల్ విసిరారు.

                                          

About Author