NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందన అర్జీలను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జగనన్నకు చెబుదాం – స్పందన అర్జీలను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం – స్పందన అర్జీలను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలను తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేసి అర్జీదారుడికి అక్నాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు. అదే విధంగా వచ్చిన దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు గాను విధులు నిర్వహించే ఉద్యోగుల ఎపిక్ కార్డు, పోలింగ్ బూత్ వివరాలను గూగుల్ షీట్ లో నమోదు చేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు నాగప్రసన్న లక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author