PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఎడి గా బాధ్యతలు  

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అమలు చేయడంలో చురుకైన పాత్రవహించాలని  ఆశాఖ ఎడి గా బాధ్యతలు చేపట్టిన పి. రాకాడ మణి ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో దివ్యాంగులు, వయోవృద్ధులు, సంక్షేమ శాఖ ఎడి గా బాధ్యతలు చేపట్టిన పి. రాకాడ మణి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క ను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు, మంచి సేవలు అందించి వారందరికి సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న పి. రాకాడ మణిని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇటీవల ప్రభుత్వం నియమించింది.

About Author