PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవెన్యూ అధికారులు.. జోక్యం చేసుకోండి..

1 min read

– పబ్లిక్​ రస్తాను వదిలి.. పట్టా స్థలంలో దారి..నా…
– న్యాయం చేయాలని దౌల్తాపురం గ్రామస్తుల విన్నపం
పల్లెవెలుగు వెబ్​, కడప : పబ్లిక్ రస్తా వదిలి.. మా పట్టా స్థలంలో దారి కావాలని దౌలతపురం, పడిగెల పల్లి గ్రామస్తులు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని సికే దీన్నే మండలం దౌలతపురం గ్రామానికి చెందిన బసిరెడ్డి. గురువి రెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 77 సర్వేనెంబర్ లో 23 సెంట్లు మా ఆధీనంలో ఉందని, ఇది మా సొంత స్థలం అని తెలిపారు. స్థలానికి సంబంధించిన పత్రాలు అన్ని ఉన్నాయని , జిల్లా కోర్టు కూడా 1985లో ఆ స్థలం మాదేనని తీర్పు ఇచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ రాస్తాను వదిలిపెట్టి మా స్థలంలో దారి కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పబ్లిక్ రాస్తా లో ఇల్లు నిర్మాణం చేస్తుంటే చూస్తూ వారి జోలికి పోకుండా మా సొంత పట్టా స్థలంలో దారి కావాలని కోరడం.. దారుణమన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు.

About Author