PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  :  ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులపై మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నందు బుధవారం ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు, ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిన మండల అభివృద్ధి అధికారి గంగనపల్లె సురేష్ బాబు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలలలో జరుగుతున్న నాడు – నేడు పనులను ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తరచుగా పరిశీలన చేయవలెయునని, అలాగే పనుల క్వాలిటీని చెక్ చేయవలెనని తెలిపారు, DE సుధాకర్ రెడ్డి మాట్లాడుతు పాఠశాలలకు కావలసిన సిమెంట్ ఇండెంట్ పెట్టి తెప్పిస్తాననీ వారం రోజుల లో అక్కడి ప్రధానో పాధ్యాయులు, పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు, అదేవిధంగా మండల విద్యాశాఖాధికారి గంగిరెడ్డి మాటాడుతు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు వారి బ్యాంకు అకౌంట్ నందు వారి పేర్లు నమోదు చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయవలెననీ తెలిపారు, ఈ కార్యక్రమం నందు ఎంఈఓ -II సునీత , ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాడు – నేడు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author