PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నాడు–నేడు’ పనులపై సమీక్ష

1 min read

– సమస్యల గురించి చర్చించన జేసీ ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఒకటైన ‘ నాడు–నేడు ’ పనులు పూర్తి కావడానికి ఎదురయ్యే సమస్యలపై జేసీ ( ఆసరా మరియు వెల్ఫేర్​)ఎంకేవీ శ్రీనివాసులు సర్వశిక్ష అభియన్​ అధికారులతో చర్చించారు. గురువారం సమగ్ర శిక్ష సమావేశభవనంలో జేసీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘నాడు–నేడు’ పనుల నిర్వహణ, పూర్తి చేయడంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం గురించి APC, DEO, Sectoral Officers, MEOs మరియు మండల ఇంజనీర్లకు జేసీ ( ఆసరా మరియు వెల్ఫేర్​) ఎంకేవీ శ్రీనివాసులు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం జిల్లా విధ్యాశాఖాదికారి శ్రీ సాయిరాం మాట్లాడుతూ నిర్ధేశించిన గడువులోపల పనులు పూర్తి చేయాలని కోరారు. APSS APC వేణుగోపాల్ గారు మాట్లాడుతూ పదిహేను రకాల సమాచారాలను సేకరిస్తున్నామని , ఈసేకరణ ఆధారంగా నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశములో సెక్టోరల్ అధికారులు , మండల విధ్యాశాఖాదికారులు పాల్గొన్నారు.

About Author