NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

1 min read

కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.

జిల్లాలోని పలు ప్రాంతాలలో  కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్    గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి  కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో  కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు  జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు తెలిపారు.ఈ రోజు జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు జిల్లాలోని  కర్నూలు ,  పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్”  సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. కర్నూలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని  నిడుజూరు, జి .సింగవరం గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కర్నూలు తాలూకా సిఐ  శ్రీధర్  , ఎస్ఐ పీరయ్య పాల్గొన్నారు. మద్దికెర పోలీసుస్టేషన్ పరిధిలోని బోజ్ఙనాయుని పేట, కొత్తపల్లి, బస నేపల్లి మాదనాoతపురం  గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు  కవాతు నిర్వహించారు.మద్దికెర ఎస్ఐ రమేష్ బాబు పాల్గొన్నారు .కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్లబండ, కమాన్ దొడ్డి గ్రామాలలో   కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కోసిగి సిఐ ప్రసాద్ పాల్గొన్నారు.

About Author