PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిట‌న్ అధ్య‌క్ష పీఠానికి చేరువ‌లో రిషి సునాక్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్రిట‌న్ అధ్య‌క్ష పీఠానికి హోరాహోరిగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇంగ్లండ్‌ మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి పీఠానికి మరింత చేరువయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత, బ్రిటన్‌ నూతన ప్రధాని స్థానం కోసం జరుగుతున్న పోటీలో ఐదో రౌండ్‌ ఎన్నికలోనూ గెలిచి తుదిపోరుకు చేరారు. ఐదో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. టోరీ పార్టీ లీడర్‌షిప్‌ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన చివరి, ఐదో రౌండ్‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో రిషీ సునాక్‌ 137 ఓట్లతో అగ్రస్థానం సాధించగా, 113 ఓట్లతో ట్రస్‌ రెండో స్థానంలో నిలిచారు.

                                           

About Author