NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే ఈరోజు పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో గురువారం మార్పుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.81కి అమ్ముడవుతోంది. మరోవైపు దేశ రాజధానిలో డీజిల్ 80 పైసలు పెరిగి లీటరుకు రూ. 93.07గా ఉంది.37 రోజుల విరామం తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల రోజువారీ సవరణను ప్రారంభించింది. 2022 మార్చి 22వతేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 6.40 చొప్పున పెంచారు.

                                             

About Author