PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీహార్ లో ఆర్జేడీ ముందంజ

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్, మోకామా రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గోపాల్ గంజ్ స్థానంలో ఆర్జేడీకి చెందిన మోహన్ ప్రసాద్ గుప్తా తన సమీప బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలో ఉన్నారు. మోకామా అసెంబ్లీ సీటులో ఆర్జేడీ అభ్యర్థి నీలందేవి ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోక్రానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి ముందంజలో ఉన్నారు.

About Author