PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురి మృతి

1 min read

పల్లెవెలుగువెబ్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పై నుంచి కారు కిందపడి ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కూడ ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులు సావంగిలోని మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులు. నిన్న రాత్రి దేవ్లీ నుంచి వార్ధా వెళ్తుండగా సెల్సురా వంతెన పై ఓ జంతువు అడ్డొచ్చింది. ఆ జంతువును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పై నుంచి కాలువలో పడింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో వారంతా అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

      

About Author