PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రహదారి భద్రత… జీవితానికి రక్ష’

1 min read

– ఎస్​ఐ ఎస్​ఎండీ షరీఫ్​
పల్లెవెలుగువెబ్​, రాయచోటి: జిల్లా పోలీసు శాఖ వారి ఆదేశాలమేరకు రాయచోటి నియోజకవర్గంలో ని సంబేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 23 నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి షరీఫ్ తెలిపారు. రోడ్డు భద్రత పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఈ ర్యాలీ తోడ్పడుతుందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కడప – చిత్తూరు జాతీయ రహదారి గుండా కొనసాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు” రహదారి భద్రత – జీవితానికి రక్షణ”, “ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం – ప్రమాదాలను అరికడదాం”, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి ,ఉపాధ్యాయులు, ఏఎస్ఐ రెడ్డయ్య , ఇతర పోలీసు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author