NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో రోడ్డు విస్తరణ పనులు :ఎమ్మెల్యే శ్రీదేవి

1 min read

పల్లెవెలుగు,పత్తికొండ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభీష్టం  మేరకే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  తెలిపారు.రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థలాలను కోల్పోతున్న కుటుంబాలతో శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డిఓ, ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.భవిష్యత్తు కోసం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ స్థలాలు కోల్పోతున్న వారు సహకరించాలని ఎమ్మెల్యే బాధితులకు విజ్ఞప్తి చేశారు. గతంలో నేతలు రోడ్డు విస్తరణను గాలికి వదిలేశారని, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం జగనన్నతో మాట్లాడి నిధులు కేటాయించేలా ఒప్పించానని  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  చెప్పారు. అందరూ సహకరించి, ముందుకు వస్తే పనులు త్వరగా పూర్తి చేసి పత్తికొండను సుందరీకరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, కేవలం అభివృద్ధి కోసమే పనులు చేపడుతున్నామని అన్నారు.  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రోడ్డు విస్తరణ పనులు ఆగవని ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఆర్డిఓ మోహన్ దాస్, తాసిల్దార్, ఆర్ అండ్ బి అధికారులు హాజరయ్యారు.

About Author