NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్డు పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు టౌన్ సరస్వతినగర్లో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం లో భాగంగా పర్యటించినప్పుడు అక్కడ స్థానిక ప్రజలు ఇండ్ల ముందు నీళ్లు నిలబడుతున్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి  చెప్పడంతో ఎమ్మెల్యే  స్థానిక నాయకులు వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి కి ఆ పనులు చేయాల్సిందిగా చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి అక్కడ వర్షపు నీరు నిలవకుండా పనులు చేయించడం జరిగింది, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో ఆయన వెంటనే పనులు చేయించడం జరిగిందని స్థానికులు తెలిపారు, ఈ సందర్భంగా వారు  ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు  మొగలి సీతారామయ్య , కుమార్ రాజు, వైయస్సార్సీపి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

About Author